కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులకు అదనపు రుణాలు అందిస్తాం; ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంత్రి స్వామి రైతు సంఘ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు.అదనపు రుణ సహాయం అందిస్తామని మంత్రి ప్రతిపాదించగా, రైతు నాయకులు తిరస్కరించారు.తమకు రుణాలు కాకుండా నో-బిడ్లు లేకుండా చూస్తూ గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలని కోరారు.బోర్డు అధికారులతో చర్చించి, ధర లభించేలా ఒత్తిడి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు.