రాయదుర్గం: ప్రశ్నించిన వైసిపి కార్యకర్తలపై కేసులా? : వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి
ఇచ్చిన హామీలు కూటమి సర్కార్ విస్మరించిందని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి ద్వజమెత్తారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డి ఆదేశాలతో బుధవారం కణేకల్లులో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్ను మండల కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి, జెడ్పిటిసి పద్మావతి, ఇతర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లైనా ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆమె విమర్శించారు.