కొండపి: కొండపి మండలం చోడవరంలో ఆరో ప్లాంట్ ప్రారంభించి సభను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరంలో నిర్మించిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి స్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ సేవలు మరువలేనివని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో రోటరీ క్లబ్ వారి దాతృత్వాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు