మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ను కలిసిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ రాయవరం వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత చైర్మన్ ను కలిశారు. జిల్లాలో ఉన్న పరిస్థితులను కలెక్టర్ వివరించారు. చైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు డాక్టర్ గౌతమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.