కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కూడా నిరాశ జనకంగా ముగిసిన పొగాకు వేలం, 121 బెల్లు తిరస్కరణ
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు పోరుబాట పట్టినా పొగాకు బేళ్ల తిరస్కరణలు మాత్రం తగ్గట్లేదు. నిన్న సోమవారం వేలం కేంద్రాల వద్ద రైతులు పొగాకు బేళ్లు సైతం తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినా నేడు డీలర్ల తీరు మారలేదు. మంగళవారం పెద్దకాండ్లకుంట గ్రామానికి చెందిన రైతులు 351 పొగాకు బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 230 మాత్రమే కొనుగోలు చేసి 121 వివిధ కారణాలతో తిరస్కరించారన్నారు.