కొండపి: జరుగుమల్లి మండలంలో ఓ మోస్తరు వర్షం, వారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా వాతావరణం మార్పు చోటుచేసుకుని వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఎండల నుంచి ఉపశమనం పొందారు. ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.