రాయదుర్గం: డి. కొండాపురం గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రాయదుర్గం మండలంలోని డి. కొండాపురం గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆర్డీఓ వసంత బాబు తో కలసి గురువారం ఈ పాసుపుస్తకాలు అందజేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో పాసుపుస్తకాలు అందించారని వివరించారు. సిఎం చంద్రబాబు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారన్నారు. మీ భూమి మీ హక్కు పేరుతో రైతులకు భూమి భద్రత కల్పించారని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, టిడిపి మండల కన్వీనర్ కురుబ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.