మార్కాపురం: మొక్కలు నాటి పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తన బంతుల తయారీ శిక్షణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. అనంతరం కార్యాలయం ఆవరణంలో మొక్కలను నాటారు. మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యత అని పిలుపునిచ్చారు