గిద్దలూరు: గిద్దలూరులోని సంజీవరాయని పేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయని పేట గ్రామంలో సోమవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదు మద్యం సీసాలను గిద్దలూరు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం విక్రయిస్తున్నాడని గుర్తించి అధికారులు సోదా నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి పరారు కాగా అతని వద్దనున్న 5 (750 ఏం.ఎల్) మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జయరావు వెల్లడించారు.