తిరుమలగిరి సాగర్: రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేయడం పట్ల సుంకిశాల తండాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన రైతులు
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని సుంకిశాల తండాలో గిరిజన రైతులు గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట సాగు కొరకు ఎలాంటి షరతులు లేకుండా ఎగరానికి రూ.6 వేలు రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేయడం అర్శించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన రైతులు కృతజ్ఞతలు తెలిపారు.