గిద్దలూరు: కొమరోలు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 163 బస్తాల రేషన్ బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నుంచి కడప జిల్లా వైపు వెళ్తున్న ఓ మినీ లారీని పోలీసులు తనిఖీ చేశారు. అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. లారీలో 163 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లుగా అధికారులు గుర్తించి లారీని సీజ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో విచారణలో తెలియవలసి ఉందని కొమరోలు ఎస్సై నాగరాజు తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.