దర్శి: దర్శి నియోజకవర్గంలో సర్ కార్యక్రమం పటిష్టంగా జరుగుతుందని వెల్లడించిన ఎన్నికల నమోదు అధికారి శాంతిలక్ష్మి
దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న సర్ కార్యక్రమాలను ఎన్నికల నమోదు అధికారి శాంతి లక్ష్మి పలు ప్రాంతాలలో తనిఖీలు చేశారు. సమయం తక్కువగా ఉన్నందున డిజిటల్లైజేషన్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు బిఎల్ఓ లకు సహకరించాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని సూచించారు. సర్ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు.