కనిగిరి: చంద్రశేఖరపురంలో పట్టపగలే మోటార్ బైక్ చోరి, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఘటన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
చంద్రశేఖరపురం: పట్టపగలే మోటర్ బైక్ చోరీకి గురికాగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సంఘటన చంద్రశేఖరపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం గ్రామంలోని గ్యాస్ గూడెం సమీపంలో బాల కేంద్రం వద్ద పార్కింగ్ చేసి ఉన్న బైక్ ను, దర్జాగా అన్నట్టు నడుచుకుంటూ వచ్చిన దొంగ బైక్ తో సహా ఊడయించాడు. బైక్ యజమాని రవి తన బైక్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా బైక్ చోరీకి గురైనట్లు గుర్తించాడు. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.