మార్కాపురం: బిరుదుల నరవ గ్రామంలో రైతు సేవా కేంద్రం సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం
మార్కాపురం మండలం బిరుదుల నర్వ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పై రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటలను పరిశీలించారు అనంతరం మండల వ్యవసాయ అధికారిని బుజ్జి బాయి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భూసారం తగ్గకుండా పర్యావరణహితంగా ఎటువంటి రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా సహజ వనరులు పశు సంపద ఆధారంగా పంటలు సాగు చేయడం వలన రైతులకు తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు అన్నారు.