రాయదుర్గం: జె. వెంకటాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ గుమ్మగట్ట మండలం జె. వెంకటాంపల్లి గ్రామానికి చెందిన వడ్డే కిరణ్ (21)మరణించాడు. మంగళవారం సాయంత్రం బైక్ పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆటో డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.