రాయదుర్గం: హోసన్నా ప్రార్థన మందిరంలో సిఎం జన్మదిన వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం పట్టణంలోని హోసన్నా ప్రార్థన మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామి దాస్, పాస్టర్స్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేశారు. పాస్టర్లతో కలసి సిఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దైవ జనుల మద్య చంద్రబాబు వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.