గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో వెంటాడుతున్న ట్రాఫిక్ కష్టాలు, రాచర్ల రైల్వే గేట్ తో అవస్థలు పడుతున్నామని వాహనదారులు వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రైల్వే గేట్ వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంటూరు గుంతకల్లు వైపు వెళ్లే గూడ్స్ రైళ్లు రైళ్లు అత్యధికంగా ఈ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు రాచర్ల రైల్వే గేటు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కంభం గిద్దలూరు మధ్య పోయే వాహనదారులు రాచర్ల రైల్వే గేట్ నుంచి వెళ్లవలసిన ఉంటుంది. గేటు వేసిన సమయంలో ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో మరింత అవస్థలు తప్పడం లేదని వాహనదారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులు తెలిపారు.