మార్కాపురం: బుచ్చన్నపాలెం ముక్కిటి గంగమ్మ తిరునాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. పొదిలి మండలం బుచ్చన్న పాలెం ముక్కిటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన టిడిపి విద్యుత్ ప్రభ పై ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడితూ ... రాష్ట్రంలో ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ప్రతిహామిని నెరవేర్చామన్నారు.