రాయదుర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం చండీయాగం చేపట్టిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
CM చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా గత 10 రోజులుగా రాయదుర్గం జంబుకేశ్వర స్వామి దేవస్థానంలో స్థానిక MLA కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో దశవిద్యా మహా హోమాలు జరుగుతున్నాయి. చివరి రోజు సోమవారం మహా చండీయాగం చేపట్టారు. ఈ హోమాలు చంద్రబాబు కు ఆధ్యాత్మిక రక్షణ కవచంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.