గిద్దలూరు: కొమరోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని పరిశీలించిన ఎస్ఐ నాగరాజు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని పలు పెట్రోల్ బంకులను ఎస్సై నాగరాజు ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. పెట్రోల్ డీజిల్ సరఫరా విషయంలో పరిస్థితిని ఎస్ఐ పరిశీలించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలతో పెట్రోల్ బంకులను పరిశీలించి ఎటువంటి కొరతలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. వాహనదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కరికి సరఫరా ఎలా చూస్తామని ఎస్సై తెలిపారు. కుత్రిమ కొరత సృష్టించేందుకు పెట్రోల్ బంకుల నిర్వాహకులు ప్రయత్నిస్తే చర్యలు తప్పమన్నారు.