కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డ్యాన్స్ పోటీలు
కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు, డీఎస్పీ రవిబాబు ల ఆధ్వర్యంలో అంబేడ్కర్ 135 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం చేసి అందరినీ అలరించారు. డాన్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ అందరూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వై పి రమేష్, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.