రాయదుర్గం: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య సహా పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు ఆర్సీపీ నాయకుల వినతిపత్రం
రాయదుర్గం పట్టణంలోని తాగునీటి సమస్య సహా నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ఉడేగోళం వచ్చిన ఆయన్ను ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి యూనస్ తదితరులు కలిసి సమస్యలు వివరించారు. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని వివరించారు. అలాగే 108 అంబులెన్స్ ను అనంతపురం వరకూ పొడగించాలని విజ్ఞప్తి చేశారు.