రాయదుర్గం: నరసాపురం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం వాసి దుర్మరణం
రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి చెందిన లడ్డూ ఇస్మాయిల్ దుర్మరణం పాలయ్యాడు. సోమవారం రాయదుర్గం నుండి కారులో అనంతపురం వెళుతుండగా నరసాపురం సమీపంలో కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ అక్కడికి అక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి బయలుదేరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.