మార్కాపురం: జూన్ 23వ తేదీ జిల్లా కేంద్రంలో పూల సుబ్బయ్య భవన్ కు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా కేంద్రంలో జూన్ 23వ తేదీ మంగళవారం 10 గంటలకు సిపిఐ మార్కాపురం జిల్లా సమితి కార్యాలయం ( పూల సుబ్బయ్య భవన్) నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఉన్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొంటారన్నారు. అనంతరం కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి వేడుకలు జరుపుతామన్నారు.