మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. ఆ సమయంలో గ్రామ సమీపంలోని ఓ కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగాయి. భారీ వర్షం పడుతున్న సమయంలో ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెట్ల కింద బహిరంగ ప్రాంతాలలో ఉండరాదని అధికారులు హెచ్చరించారు.