కొండపి: సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో అధికారుల నిర్లక్ష్యం, ప్రకటించిన ప్లాట్ఫారంపై కాకుండా మధ్య ట్రాక్పై వచ్చిన రైలు
ప్రకాశం జిల్లా.సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో అధికారుల నిర్లక్ష్యం వల్ల శనివారం ప్రజలు అవస్థలు పడ్డారు. మూడవ నెంబర్ ప్లాట్ఫారం పైకి పినాకిని ఎక్స్ప్రెస్ రైలు వస్తుందని అధికారులు అనౌన్స్మెంట్ చేశారు. అయితే రెండు మూడు ప్లాట్ఫారం మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పైకి రైలు రావడంతో వృద్ధులు పిల్లలు రైలు దిగేందుకు అవస్థలు పడ్డారు. అయితే ఇది సాంకేతిక పరిజ్ఞానం లోపంతో జరిగిందా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది ఉన్నత అధికారులకు దర్యాప్తులో తేలవలసి ఉంది. అయితే ప్రయాణికులు మాత్రం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.