దర్శి: దొనకొండ మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Darsi, Prakasam | May 14, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఆరేళ్లపాడు రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నాగ తేజ విజయ్ చిన్న బాబుకు గాయాలు కావడంతో వారిని 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ కు తరలించారు. రెండవ మోటార్ బైక్ పై వస్తున్న దొనకొండ మండలం రుద్ర సముద్రానికి చెందిన ఆవులయ్య మృతి చెందినట్లు దర్శి ఎస్ఐ మురళి తెలిపారు. మొదటి బైక్ పై ఉన్న ముగ్గురికి తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.