మార్కాపురం: జనగణన పై అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కే రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలో జనగణన పై అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కె రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా జన గణ మన లో పాల్గొని దేశ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ పక్రియలు రెండు దశల్లో జరుగుతాయని ఈ నెల 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉందన్నారు. మొబైల్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.