రాయదుర్గం: గుమ్మగట్ట రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో బాలుడు సహా నలుగురికి తీవ్ర గాయాలు
రాయదుర్గం పట్టణ శివారులోని గుమ్మగట్ట రోడ్డులో శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు సహా నలుగురు గాయపడ్డారు. గుమ్మగట్ట మండలంలోని జె. వెంకటాంపల్లి గ్రామానికి చెందిన గంగన్న, గజేంద్ర బైక్ పై రాయదుర్గం నుండి స్వగ్రామానికి వెళుతుండగా బిటిపి లేఔట్ నుంచి మలుపు వద్ద నవీన్, రాము అనే బాలుడు మరో బైక్ పై మెయిన్ రోడ్డు లోకి రావడంతో రెండు బైక్ లు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురూ గాయపడగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.