ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏడవ వార్డులో ప్రజా ఉద్యమంలో భాగంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మూడుసార్లు సీఎం గా పని చేశారు కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు. మాజీ సీఎం జగన్ తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.