గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 10వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 10వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి దద్దవాడ గుండ్రెడ్డిపల్లి, వెంకటంపల్లి, నారాయణ పల్లి, అలసందలపల్లి గ్రామాలలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు ప్రజల సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.