దర్శి: పేకాట ఆడుతున్న శిబిరంపై దాడి చేసి ఐదు మందిని అదుపులోకి తీసుకున్న కురిచేడు పోలీసులు
Darsi, Prakasam | Jun 29, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమట గంగవరం గ్రామ శివారు ప్రాంతంలో పొగాకు బ్యార్ని లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. సమాచారం అందుకున్న కురిచేడు ఎస్సై కోటయ్య తన సిబ్బందితో వెళ్లి పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 24,780 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.