కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో 20న సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తదాతలకు మూడు లక్షల బీమా, వాటర్ బాటిళ్లను ఇవ్వనున్న ఎమ్మెల్యే
కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో ఈనెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. రక్తదానం చేసే రక్త దాతలకు 300000 బీమా చేయించడంతోపాటు అందరికీ వాటర్ బాటిళ్లను ఎమ్మెల్యే అందజేస్తారని టీడీపీ నాయకులు శుక్రవారం చెప్పారు. రక్తదాతలందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.