గిద్దలూరు: మహిళపై కర్రతో దాడికి పడ్డ నలుగురికి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు. రూ.1000 జరిమానా
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన చందా వెంకట రమణమ్మ అనే మహిళపై కర్రతో 2022లో నలుగురు దాడికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి భరత్ చంద్ర.. నేరం రుజువు కావడంతో మహిళపై కర్రతో దాడికి పాల్పడ్డ మాయిళ్ళపల్లి కాశమ్మ, మాయిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, మాయిళ్ళపల్లి అశోక్, కోన చందు అనే నలుగురికి ఒక్కొక్కరికి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష రూ.1000 ఒక్కొక్కరికి జరిమానా విధించారు.