మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 183 అర్జీలు వచ్చినట్లు తెలిపిన కలెక్టర్ విజయ సునీత
ప్రజల సంతృప్తి మేరకు పనిచేయడం అధికారుల లక్ష్యమని ఆ దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ... కొన్ని శాఖలలో ప్రజల సంతృప్తి మేరకు అధికారులు పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 183 అర్జీలు వచ్చాయన్నారు