కళ్యాణదుర్గం: హనుమంతరాయ చౌదరి మృతి టీడీపీ కి తీరని లోటు: ఎర్రంపల్లి లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్
కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో శనివారం ఆయన పర్యటించారు. హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేశారన్నారు. పదేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు ఎదురొడ్డి నిలుచున్నాడన్నారు. ఆయన భౌతికంగా లేకపోవడం తనను కూడా వ్యక్తిగతంగా బాధిస్తున్నదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.