దర్శి: మంగళవారం తోటి సర్ కార్యక్రమం ముగిస్తుందని వెల్లడించిన ఈఆర్వో శాంతిలక్ష్మి
Darsi, Prakasam | Jul 13, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మంగళవారం తోటి సర్ కార్యక్రమం ముగిస్తుందని అసెంబ్లీ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శాంతిలక్ష్మి తెలిపారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జూలై 21వ తేదీన ఓటర్ల లిస్టు ప్రకటిస్తామని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. చివరి రోజు పెండింగ్ లో ఉన్న సంబంధిత పేపర్లను బిఎల్ఓ లకు ఇవ్వాలని సూచించారు.