యర్రగొండపాలెం: జి ఉమ్మడివరంలో మూతబడిన సచివాలయంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా తిరుప్రాంతకం మండలంలోని జి.ఉమ్మడివరం సచివాలయానికి తాళాలు పడ్డాయి. రెండు సంవత్సరాలుగా ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించకపోవడంతో ఆ ఇంటి యజమాని తాళం వేశారు. ఇటీవల సచివాలయానికి కార్యదర్శి హాజరు కాకపోవడంతో అద్దె బిల్లులు చెల్లించలేదని దీంతో ప్రజల అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అందడం లేదని సచివాలయం తెరిపించాలని ప్రజలు కోరారు.