రాయదుర్గం: మురడి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం, 29 న బాలాలయం నిర్మాణం
డి.హిరేహాల్ మండలం సుప్రసిద్ధ శ్రీ మురడి ఆంజనేయస్వామి దేవస్థానం పునఃనిర్మాణంలో బాగంగా విమాన గోపురం, గర్భాలయం, అర్థమండపాలను రాతి కట్టడముతో నిర్మించనున్నారు. ఈ నెల 29 న టేకు కర్రతో స్వామి వారి మూర్తిని తయారుచేసి దేవస్థానము ప్రాంగణములో బాలాలయమం ప్రతిష్ఠ చేయనున్నట్లు ఈఓ నరసింహరెడ్డి తెలిపారు. కొంతకాలం భక్తులు ఈ స్వామివారినే దర్శించుకొనవలసి వుంటుందన్నారు. నిర్మాణపు పనులు పూర్తి అవ్వగానే మళ్ళీ శ్రీస్వామివారి నిజ విగ్రహ దర్శనమును కల్పించబడునని తెలియజేశారు.