కొండపి: కొండపి మండలం చిన్న వెంకన్నపాలెం సమీపంలో బోల్తాపడ్డా ఆటో, ఏడు మందికి తీవ్ర గాయాలు, 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా కొండపి మండలం చిన్న వెంకన్నపాలెం సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఈ కూలీలు సింగరాయకొండ పొగాకు ఫ్యాక్టరీలో పని ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారందరిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.