రాయదుర్గం: మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి : జిల్లా కలెక్టర్ ఆనంద్
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా 20.వేల మందిని చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ఏ ప్రైవేటు పాఠశాలకు తీసిపోని విధంగా ఉన్నాయని మంచి ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. రాయదుర్గంలో MLA కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో టెన్త్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.