మార్కాపురం: పారిశుద్ధ్య కార్మికుల జీతాలు విడుదల చేయాలని పొదిలిలో నిరసన ర్యాలీ
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అనుబంధ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పొదిలి నగర పంచాయతీ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు. అనంతరం నగర వీధులలో తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సిఐటియు నాయకులు అన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని కోరారు