రాయదుర్గం: జూలై 1 నుండి 4 వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక తరగతులు విజయవంతం చేయండి : ఏఐఎస్ఎఫ్
జూలై 1 నుండి 4 వరకు కర్నూలులో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు విజయవంతం చేయాలని ఆ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజు, తరుణ్ సభ్యులు నవీన్ , వినయ్, భరత్ రాజు, పవన్ కోరారు. శుక్రవారం రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కరపత్రాలు విడుదల చేశారు. 90 ఏళ్ల విద్యార్థి త్యాగాల చరిత్ర కలిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య తరగతులకు రాష్ట్ర, జిల్లాల ప్రతినిధులు హాజరవుతారన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి, విద్యారంగానికి నిధులు తగ్గించి, విద్యార్థులను కార్పొరేట్ కార్మికులుగా తయారు చేస్తున్నారుని విమర్శించారు. JEE, NEET పేరుతో లక్షల కోట్ల వ్యాపారం చేస