కొండపి: సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్, దొంగగా భావించి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి గురువారం హల్చల్ చేశాడు. ఓ ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అతను దొంగగా భావించిన గ్రామస్తులు పట్టుకున్నారు. కాకుండా గ్రామస్తులకు పొంతన లేని సమాధానం చెప్పడమే కాకుండా ఓ వ్యక్తి గొంతు పట్టుకోవడంతో స్థానికులు దేహశుద్ధి చేసి అతనిని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.