రాయదుర్గం: పట్టణంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువకుడు
రాయదుర్గం పట్టణంలోని భం భం స్వామి లే ఔట్ లో నివాసం ఉంటున్న సురేష్ అనే యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు డ్రైవర్ గా పనిచేస్తున్న అతను మద్యానికి బానిసై అతిగా మద్యం సేవిస్తుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. మనస్థాపానికి గురై గురువారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ జయనాయక్ తెలిపారు.