కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కైరేవులో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని సెట్టూరు మండలం కైరేవు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రీ సర్వే వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు.