మార్కాపురం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మోసం చేసిందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టు పూర్తికాకుండానే గత ప్రభుత్వం జాతికి అంకితం చేసి తమ ప్రాంత ప్రజలను అన్యాయం చేసిందన్నారు. మళ్లీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని అతి త్వరలో తమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు సందర్శించేందుకు వస్తున్న సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.