ఉరవకొండ: ఉరవకొండ లోని అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ బంగ్లా సమీపంలో నూతనంగా అన్నా క్యాంటీన్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం పరిశీలించారు. ఆయన పలువురు టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ నిర్మించి ప్రజలకు కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతున్నదన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.