తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కోరిన సిపిఐ నేతలు
తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలంటూ సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కోరారు. డీఎస్పీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.