మార్కాపురం: నిజాయితీని చాటుకున్న పొదిలి ఆర్టీసీ డిపో కండక్టర్ వెంకయ్య డ్రైవర్ వెంకటేశ్వర్లు
మార్కాపురం జిల్లా పొదిలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఏసుదాయమ్మ బొద్దికూరపాడులో ఎక్కి రాజంపల్లిలో దిగిపోయింది. బస్సు దిగే ముందు నగదు ఉన్న సంచిని బస్సులో మర్చిపోయింది. ఆ సంచిని బస్సు డ్రైవర్ వెంకటేశ్వర్లు కండక్టర్ వెంకయ్య ఆర్టీసీ ఎంక్వయిరీ అధికారులకు అప్పగించారు. సంచి పోగొట్టుకున్నట్లు ఆ మహిళ వారి బంధువులకు తెలియజేశారు. వారు ఆర్టిసి సీఐ రవణమ్మను సంప్రదించగా సంచిని వారి బంధువులకు అప్పగించారు. ఉద్యోగులను అభినందించారు